కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుంది

Jan 24,2024 20:45 #nara bhuvaneswari, #paramarsa

పలు కుటుంబాలకు నారా భువనేశ్వరి ఓదార్పు

ప్రజాశక్తి – తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం:టిడిపి కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి భరోసా ఇచ్చారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మనస్తాపంతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను బుధవారం ఆమె పరామర్శిచి ఆర్థిక సాయం అందించారు. పార్టీ కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులేనని, వారికి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిజం గెలవాలి మూడ్రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు జగ్గంపేట, పెద్దాపురం, తుని రూరల్‌, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. జగ్గంపేటలో పడాల వీరబాబు కుటుంబాన్ని, పెద్దాపురం మండలం కాండ్రకోటలో బుద్దాల సుబ్బారావు కుటుంబాన్ని, తుని రూరల్‌ తేటగుంటలో ఈసరపు నూకరాజు కుటుంబాన్ని, కాకినాడ సిటీలో చిక్కాల సత్యవతి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ఆ కుటుంబాలకు రూ. మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.

➡️