ప్రజాశక్తి – కాళ్ల (పశ్చిమగోదావరి జిల్లా): గుండెపోటుతో ఉపాధి హామీ కార్మికుడు మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఉపాధి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్లకూరు గ్రామానికి చెందిన సోడదాసి గాబ్రియేలు (72) తోటి కార్మికులతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లారు. గ్రామ సమీపంలోని కాలువలో మట్టి తీస్తుండగా గుండెల్లో నొప్పిగా అనిపించడంతో కాల్వలో నుంచి గట్టుపైకి ఎక్కారు. కొద్దిక్షణాల్లో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎంపిడిఒ ఎంఎస్.ప్రభాకర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం గాబ్రియేలుకు డెత్ క్లెయిమ్ వర్తిస్తుందని టెక్నికల్ అసిస్టెంట్ రమేష్బాబు తెలిపారు.