తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

తిరుమల : వారంతపు సెలవు దినం కారణంగా తిరమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులతో 30 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని యాత్రికులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. శనివారం స్వామివారిని 68,446 మంది యాత్రికులు దర్శించుకోగా 28,549 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చిందన్నారు.తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. ఆనంతరం తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి యాత్రికులకు దర్శనమిచ్చారు.

➡️