నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

  • నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులను కలిసి నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చెక్కులు పంపిణీ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. ఘటనపై 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

➡️