ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్ : పీటీవారెంట్పై అరస్టయిన ఇద్దరు నిందితులు పోలీసులు కళ్ళు గప్పి కోర్టు ఆవరణ నుంచి పరారైన ఘటన ఏలూరులో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన 7/24 కేసులో ఇద్దరు నిందితులను పీటీ వారెంట్పై పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు కోర్టులో హాజరు పరుస్తున్న సమయంలో ఇద్దరు నిందితులు పోలీసుల కళ్ళు గప్పిపరారయ్యారు. పారిపోయిన వారి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.