ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) 56,228 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 18,886 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.