గ్రూప్‌-2 స్క్రీనింగ్‌లో 92,950 మంది అర్హత

Apr 11,2024 00:24 #APPSC Group, #Exams

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలో అర్హత సాధించిన వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌ షషష.జూరష.aజూ.స్త్రశీఙ.ఱఅలో పొందుపరిచినట్లు ఎపిపిఎస్‌సి కార్యదర్శి జె ప్రదీప్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 గ్రూప్‌-2 పోస్టుల భర్తీ కోసం ఎపిపిఎస్‌సి డిసెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25న జరిగిన పరీక్షకు 4.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసిన వారిలో 92,950 మంది అర్హత సాధించారు. 2,557 మంది అభ్యర్థులను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు కార్యదర్శి వెల్లడించారు. అర్హత సాధించిన వారి జాబితాను, తిరస్కరించిన వారి జాబితాను విడివిడిగా విడుదల చేశారు. అర్హత సాధించిన అభ్యర్థులకు జులై 28న ప్రధాన పరీక్ష ఉంటుందని వెల్లడించారు.

➡️