ప్రజాశక్తి – విశాఖపట్నం :ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కోర్సుల్లో సెల్ఫ్సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు నిర్వహించిన ఎయుఇఇటి 2024 ప్రవేశ పరీక్షా ఫలితాలను మంగళవారం ఎయు విసి ఆచార్య పివిజిడి.ప్రసాద్రెడ్డి విడుదల చేశారు. మే ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 14 కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షకు 4349 మంది దరఖాస్తు చేయగా 3952 మంది హాజరయ్యారు. పరీక్షా ఫలితాలను ఎయు వెబ్సైట్లో ఉంచామని, త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ను విడుదల చేస్తామని ప్రసాద్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, ప్రవేశాల సంచాలకులు ఆచార్య డిఎ.నాయుడు పాల్గన్నారు. ఈ ఫలితాలలో పెందుర్తికి చెందిన యు.సాయి ఈశ్వర్ మొదటి ర్యాంకు, చంద్రంపాలెంనకు చెందిన కె.సాయి ప్రణీత్ రెండో ర్యాంకు, తగరపువలసకు చెందిన జి.మోహన్ సాయి సంపత్ మూడో ర్యాంకును, రాజమండ్రికి చెందిన ఎస్డివి.సంకల్ప్ నాలుగో ర్యాంకు, పాలకొల్లుకు చెందిన డిజె.నాగమంజుల ఐదో ర్యాంకు సాధించారు.