నెల్లూరు టౌన్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

నెల్లూరు : నెల్లూరు టౌన్‌ లో సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి మూలం రమేష్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల రాజు గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … బిజెపి, వైసిపి, టిడిపి అరాచక పాలనను ప్రజలకు వివరించారు. తమను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కఅషి చేస్తామని, నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం అభివఅద్ధిని విస్మరించిందని తెలిపారు. బిజెపి అరాచక పాలనకు మద్దతు తెలుపుతున్న టిడిపి, జనసేన, వైసిపిలకు ఓటుతో బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.

➡️