పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? : చంద్రబాబు

Apr 29,2024 12:45 #Chandrababu Naidu, #pensions, #speech

కర్నూలు : పింఛన్ల కోసం మండుటెండల్లో తిప్పడం సబబా ? అని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ … పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారనీ… మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా ? అని ప్రశ్నించారు. కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదఅష్టకరమన్నారు. సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అడిగారు. ఒక్కో వ్యక్తి 45 పింఛన్లు ఇస్తే సరిపోతుందని.. ఎన్నికల అధికారులు చెప్పినా వినే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్‌ చేశామన్నారు.

➡️