సీఎం జగన్‌ ఒక మానసిక రోగి : చంద్రబాబు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన రా.. కదలిరా సభ ఇవ్వాళ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని మండిపడ్డారు. ఇప్పటికే ఈ సైకోతో మేము వేగలేమని నలుగురు ఎంపీలు పారిపోయారు, మరోపక్క మాకోద్దీ సైకో అని ఆరుగురు ఎమ్మెల్యేలు పారిపోయారని.. మరో ఇద్దర ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారని.. రేపో మాపో మనం గేట్లు ఓపెన్‌ చేస్తే ఆ పార్టీ ఖాళీ అయిపోతుందని అన్నారు. బదీలీల రాజకీయాన్ని నేనేప్పుడు చూడలేదని.. కొంత మందిని ఇంటికి పంపించాడని, మరికొంతమందిని మార్చారని.. ఈ మర్చిన వారిలో సగం మంది 8 మంది దళితులు, 6 గురు బీసీలే ఉన్నారని, ఇందులో 10 మంది మంత్రులు అవుట్‌ అయిపోయారని అన్నారు. టీడీపీ- జనసేన కలవగానే వైసీపీ వాళ్ళకు ప్యాంట్‌ తడిచి పోయిందని. అంతా డైపర్లు వేసుకొని తిరుగుతున్నారని అన్నారు. టీడీపీ – జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని అన్నారు.

➡️