ఎన్నికల సంఘానికి నరసరావుపేట ఎంపీ ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల సంఘానికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. శనివారం సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైసిపి నేతలపై ఫిర్యాదు చేశారు. విశాఖ డ్రగ్స్‌ వ్యవహారంలో ఎలాంటి ఆధారాల్లేకుండా తనపై వైసిపి ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణకొనసాగుతోందని, నిజనిర్ధరణ కాకుండానే తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆరోపణలు చేయడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

➡️