ప్రజాశక్తి – అమరావతి బ్యూరో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే మూడు లోక్సభ, పది శాసనసభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ఎఐసిసి జనరల్ సెక్రటరీ విడుదల చేశారు. తుది జాబితాలో ప్రకటించిన మూడు ఎంపి స్థానాల్లో నరసాపురం నుంచి కొర్లపాటి బ్రహ్మానందరావు (కెబిఆర్ నాయుడు), రాజంపేట నుంచి ఎస్ బషీద్, చిత్తూరు (ఎస్సి) నుంచి ఎం జగపతిని ఎంపి అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. శాసనసభ స్థానాలకు సంబంధించి చీపురుపల్లి ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థి తుమ్మగంటి సూరి నాయుడు స్థానంలో ఆదినారాయణ జమ్ము, శృంగవరపుకోట నుంచి జి తిరుపతి, విజయవాడ తూర్పు నుంచి సుంకర పద్మశ్రీ స్థానంలో పొనుగుపాటి నాంచారయ్య, తెనాలి నుంచి ఎస్ బషీద్ స్థానంలో చందు సాంబశివుడు, బాపట్ల నుంచి గంటా అంజిబాబు, సత్తెనపల్లి నుంచి చంద్రపాల్ చుక్కా, కొండపి (ఎస్సి) నుంచి శ్రీపతి సతీష్కు బదులు పసుమర్తి సుధాకర్, మార్కాపురంలో షేక్ సైదా స్థానంలో సయ్యద్ జావీద్ అన్వర్, కర్నూలు నుంచి షేక్ జిలానీ బాషా, ఎమ్మిగనూరు నుంచి మరుముల్ల కాశీంవలి, మంత్రాలయం నుంచి పిఎస్ మురళీకృష్ణరాజును అభ్యర్థులుగా ప్రకటించారు.
కాంగ్రెస్ మార్కాపురం అభ్యర్థి మార్పు.. ఎస్కె సైదా స్థానంలో సయ్యద్ జావిద్ అన్వర్
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం మార్చింది. తొలుత నియోజకవర్గం అభ్యర్థిగా ఎస్కె సైదాను ప్రకటించింది. ఆయన ఎన్నికల ప్రచారంలో నిమగమై నామినేషన్ కూడా దాఖలు చేశారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో సయ్యద్ జావిద్ అన్వర్ పేరును ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్రెడ్డి నుంచి బుధవారం ఆయన బిఫారమ్ అందుకున్నారు.ఈ మేరకు ఈదా సుధాకర్రెడ్డి వెల్లడించారు.