ప్రజాశక్తి-తిరుమల : తిరుమల తిరుపతి క్షేత్రం యాత్రికులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలో యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. కాగా టెకెన్లు లేని వారికి దర్శనానికి ఖచ్చితంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోందని.. రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శనివారం స్వామి వారిని 81,212 మంది దర్శించుకున్నారని తెలిపారు. అందులో 32,403 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారన్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.