39 ప్రాంతాల్లో భారీ వర్షాలు

May 9,2024 06:55 #AP, #heavy rains

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 39 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడులో 130.6 మిల్లీమీటర్లు, రాజమండ్రిలో 114.2, కడియంలో 114, కోనసీమ జిల్లా మండపేటలో 110, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 102, ప్రకాశం జిల్లా మార్కాపురంలో 98.4, కడప జిల్లా రాజుపాలెం 95.8 మి.మీ చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. బంగాళాఖాతంలో నెలకొన్న ద్రోణి ప్రభావంతో గురువారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని పేర్కొన్నారు.

➡️