ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం మీ సొంతం

Feb 19,2024 11:17 #MLC KS Lakshmana Rao, #SFI

 గ్రూప్‌-2 అవగాహన సదస్సులో కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి-గుంటూరు :   గ్రూప్‌-2 పరీక్ష రాసే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు ఎసి కాలేజీలో ఆదివారం డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గ్రూప్‌-2 అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.  డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వై కృష్ణకాంత్‌ అధ్యక్షతన జరిగిన సభలో పోటీ పరీక్షల కోసం రూపొందించిన ‘భారత సమాజం’ అనే పుస్తకాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి మోజేస్‌, ‘ఆంధ్రుల చరిత్ర- ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక వ్యవస్థ’ అనే పుస్తకాన్ని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ ట్రస్ట్రీ పాశం రామారావు ఆవిష్కరించి అభ్యర్థులందరికీ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, పాశం రామారావు, కాలేజి ప్రిన్సిపల్‌ పి మోజేస్‌ తదితరులు ప్రసంగించారు.

➡️