తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న జాన్వీకపూర్‌

తిరుపతి : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి జాన్వీకపూర్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టిటిడి ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి జాన్వీ కపూర్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

➡️