ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాజీనామా.. ఆమోదం తెలిపిన గవర్నర్‌

Dec 4,2023 07:56 #cm kcr

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో కెసిఆర్‌ తన రాజీనామా లేఖను సిఎంఒ కార్యాలయ సిబ్బందితో గవర్నర్‌కు పంపించారు. సిఎం రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించినట్టు సమాచారం. కాగా ఏ ముఖ్యమంత్రి ఆయినా ఓటమి చవిచూసినప్పుడు ఆనవాయితీగా గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తారు. అయితే కెసిఆర్‌ మాత్రం గవర్నర్‌ను నేరుగా కలువకుండా సిబ్బందితో రాజానామా లేఖను పంపించడం చర్చనీయాంశంగా మారింది.

➡️