రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Nov 26,2023 10:21 #Bapatla District, #road accident
road accident in addanki

ప్రజాశక్తి-అద్దంకి : ప్రమాదవశాత్తు కారు రోడ్డు మార్జిన్ లో నుండి ప్రక్కకు దూసుకు వెళ్లి వాహనం నడుపుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన జరిగింది. వివరాలలోకి వెళ్తే బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన తన్నీరు ఆంజనేయులు (30) ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో ఉన్న భార్య వద్దకు శనివారం రాత్రి అద్దంకి పట్టణము నుండి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాయిపాలెం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ బ్రిడ్జి కి కూతవేటు దూరంలో మృతుడు ప్రయాణిస్తున్న కారు గుంటల్లోకి దూసుకెల్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటన సమీపంలో టీ దుకాణం ఉండటంతో ఆదివారం తెల్లవారుజామున స్థానికులు కారును గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని కార్లు మృతి చెందిన ఆంజనేయులను అద్దాలు పగలగొట్టి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

➡️