అనంతపురం రేంజ్‌ డీఐజీగా షిముషి బాజ్‌పేయ్

అమరావతి: అనంతపురం రేంజ్‌ డీఐజీగా షిముషి బాజ్‌పేయ్ ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సీఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. అనంతపురం డీఐజీగా పని చేసిన అమ్మిరెడ్డిపై సోమవారం ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఆదేశించింది. ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు అర్హులైన ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని సీఎస్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా షిముషి బాజ్‌పేయ్ ని ఈసీ నియమించింది.

➡️