ఏలూరు : ‘ మమ్మల్ని కూడా పట్టించుకోండి.. న్యాయమేగా ‘ అంటూ … తమ సమస్యల పరిష్కారం కోరుతూ డిఆర్డిఎ వైఎస్సార్ క్రాంతి పథకం (సెర్ఫ్) ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వం తమను పట్టించుకోవాలని, న్యాయబద్ధమైన తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులంతా డిమాండ్ చేశారు.