అవిరామంగా సమ్మెలో పాల్గొన్న సిఐటియు నేతకు అస్వస్థత

ఏలూరు : 22వరోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతోంది. అంగన్వాడీలకు మద్దతుగా సమ్మెలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు పాల్గొంటున్నారు. అయితే మంగళవారం ఉదయం సమ్మె చేసే శిబిరం వద్ద రాంబాబు ఉన్నపాటుగా అస్వస్థతకుగురయ్యారు. 21 రోజుల నుంచి నిరసన దీక్షలో అవిరామంగా పాల్గొనడంతో రాంబాబు ఆరోగ్యం క్షీణించింది. హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్‌ కి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. రాంబాబు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️