14 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించిన కోర్టు

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీని పొడిగిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. ముగ్గురు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని కూడా కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది.

➡️