వివేకా హత్య గురించి మాట్లాడొద్దన్న కేసులో.. విచారణ నుంచి వైదొలిగిన న్యాయమూర్తులు

Apr 29,2024 21:40 #AP High Court, #Viveka murder case

ప్రజాశక్తి-అమరావతి : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి, వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌, ఆ పార్టీ నేతలపై ఏ విధమైన వ్యాఖ్యలూ చేయరాదన్న కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేసిన పిటిషన్‌ విచారణ నుంచి జస్టిస్‌ యు దుర్గాప్రసాదరావు తప్పుకున్నారు. మరో ధర్మాసనం విచారణ చేసే విధంగా పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జగడం సుమతితో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత, పులివెందుల అసెంబ్లీ టిడిపి అభ్యర్థి రవీంద్రనాథ్‌ రెడ్డి (బిటెక్‌ రవి) దాఖలు చేసిన వేర్వేరు వ్యాజ్యాలను గతంలో విచారణ చేపట్టేందుకు జస్టిస్‌ ఎవి శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ఇప్పుడు జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ధర్మాసనం కూడా అదే విధంగా చేసింది.

➡️