పెద్దపల్లి : ఇన్నాళ్లు ఉపాధి కల్పించిన ఆ రైళ్లే వారి పాలిట మృత్యు పాశాలవుతాయనివారు ఊహించలేకపోయారు. పొట్టకూటి కోసం రైళ్లలో వాటర్ ప్యాకెట్లు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ ఇద్దరి వ్యక్తులను విధి చిన్న చూపు చూసింది. రైల్వే స్టేషన్ క్యాంటీన్లో వాటర్ క్యాన్స్ వేసి టీ తాగేందుకు రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు రూపంలో వచ్చిన మఅత్యువు ఆ ఇద్దరిని బలితీసుకుంది. ఇన్నాళ్లు ప్రయాణికులకు నీళ్లందించే ఆ కార్మికుల కుటుంబాలకు మాత్రం చివరికి కన్నీళ్లే మిగిలాయి.ఈ హఅదయవిదాకర సంఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రాజు(40) యాకూబ్ (45) అనే ఇద్దరు వ్యక్తులు రైళ్లలో, క్యాంటిన్లలో వాటర్ సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే వాటర్ ప్యాకెట్ల్ సరఫరా చేస్తుండగా ప్రమాదవశాత్తు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రెయిన్ డీ కొని అక్కడికక్కడే మృతి చెందారు. రాజు, యాకుబ్ మఅతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.