ప్రజాశక్తి – ఎ.కొండూరు (ఎన్టిఆర్ జిల్లా) : కిడ్నీ వ్యాధితో వార్డు సభ్యురాలు మృతి చెందిన సంఘటన ఎన్టిఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కృష్ణారావుపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నగర తండాకు చెందిన వార్డు సభ్యురాలు భారోతు జమకి (51) పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. రెండేళ్లుగా డయాలసిస్ చేయిస్తున్నట్టు ఆమె భర్త భారోతు మంగన తెలిపారు. అప్పులు తెచ్చి వైద్యం చేయించినా ఫలితం లేదని వాపోయారు. వ్యాధి తీవ్రమవ్వడంతో జమకి మృతి చెందినట్లు తెలిపారు. ఎ.కొండూరు తహశీల్దార్ రూ.10 వేలు, గ్రామ సర్పంచ్ పర్వతనేని నాగమల్లేశ్వరి చంద్రమోహనరావు రూ.10 వేలు చొప్పున మట్టి ఖర్చులు నిమిత్తం మతురాలి భర్తకు ఆర్థిక సాయం అందజేశారు. మృతదేహాన్ని సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, నాయకులు పానేం ఆనందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, మండల కార్యదర్శి మేకల డేవిడ్, వైసిపి నాయకులు భూకియా గనియ, ఎంపిటిసి సభ్యులు భారోతు వెంకటేష్ నాయక్, పెద్దబాబు తదితరులు సందర్శించి నివాళులర్పించారు.