విశాఖ : ఎన్డిఏ కూటమిని ఓడించాలంటూ … విశాఖలోని మహారాణి పార్లర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్.షర్మిల ఇండియా వేదిక సభను ఆదివారం నిర్వహించారు. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఉక్కు పరిరక్షణ నినాదాలు సభా ప్రాంగణంలో మారుమ్రోగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సిఐటియు నాయకులు షర్మిలకు వినతిపత్రాన్ని సమర్పించారు. విశాఖ అభివృద్ధికి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే సిపిఎం అభ్యర్థి ఎం.జగ్గు నాయుడు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.నరసింహారావు, సిపిఐ అభ్యర్థి విమల, కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డి పాల్గొన్నారు.