హైదరాబాద్ : ఫైనాన్సీయల్ సేవల సంస్థ సింక్రోనీ తన నూతన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ ఇండియాగా రచనా బహదూర్ను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్ పరిశ్రమలో 30 ఏళ్ళకు పైగా స్ఫూర్తిదాయక కెరీర్తో, సింక్రోనీలో తన కొత్త భాద్యతలకు అనుభవాన్ని, నాయకత్వాన్ని రచన తీసుకు రానున్నారని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. రచన బహదూర్ గోల్డ్మన్ సాక్స్, జెపి మోర్గాన్ చేజ్, మోర్గాన్ స్టాన్లీతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రముఖ ఆర్థిక సంస్థలలో ముఖ్యమైన పదవులను నిర్వహించారు.