శ్రీకాకుళం : ఎచ్చెర్ల మండలం అరినాం అక్కివలసలోని ఎన్ఎసిఎల్ ఇండిస్టీస్ లిమిటెడ్ కార్మికులు తమ ఔదార్యం చాటుకున్నారు. పరిశ్రమలో పనిచేస్తూ అనారోగ్యంతో మఅతి చెందిన గాడు.పారయ్య కుటుంబం జీవనాధారం కోల్పోయిన నేపథ్యంలో నాగార్జున అగ్రికం పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులంతా తమ ఒకరోజు వేతనాన్ని మఅతుని కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పరిశ్రమ వద్ద నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశంలో మఅతుని భార్య గాడు.అమలమ్మ కు కార్మికుల నుంచి వసూలు చేసిన ఒక రోజు వేతనం మొత్తం రూ:1,07,000 లును సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, నాగార్జున అగ్రికం వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.వరదరాజు, ఎం.రమణ, కోశాధికారి ఎల్.చిరంజీవి చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిహెచ్.సత్యనారాయణ, ఎల్.అప్పయ్య, లక్ష్మణరావు, చిన్న, పి.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు