జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం : ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మంగళవారం జిల్లాలో జరిగిన ఇంటర్‌ పరీక్షకు 1517 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్‌ఐఒ ఎం.ఆదినారాయణ తెలిపారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా మొత్తం 23652 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22135 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. మిగిలిన 1517 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. పరీక్ష ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని ఆర్‌ ఐ ఓ ఎం.ఆదినారాయణ వివరించారు.

➡️