చక్రాలు బండి సావిత్రికి సాయం

Apr 12,2024 13:34 #Eluru district

ప్రజాశక్తి-ప్రగడవరం : ప్రగడవరం పంచాయతీ ఫాతిమాపురం గ్రామంలో నిన్న రోడ్డు పక్కన చక్రాల బండిపై పండ్లు అమ్ముకుంటున్న చిట్లూరి సావిత్రి బండి ప్రమాదానికి గురైంది. ఫాతిమాపురం సెంటర్లో ప్రమాదం జరిగిందని తెలిసిన నాయకులు గానీ ఎవరు స్పందించలేదు. చెట్లూరి సావిత్రి జీవన ఉపాధి కోసం తయారు చేసుకున్న చక్రాలు బండి విరిగిపోయి బండిపై ఉన్న పండ్లు మొత్తం పాడైపోయిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తున్న మార్గమధ్యంలో ప్రమాదం జరిగిందని గమనించి వెంటనే వెని తిరిగి వచ్చి వారిని పరామర్శించి వారికి భరోసా కల్పించి 10,000(పదివేల రూపాయలు) ఆర్థిక సాయం చేశారు. చిట్లూరి సావిత్రి మాట్లాడుతూ ప్రమాదం జరిగిందని  ఎవరు పట్టించుకోలేదు. కానీ రోషన్ తమ కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

➡️