ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : ఆరోగ్యమే మహాభాగ్యం అని, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు నివారించుకోవచ్చని పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ సువర్చల, డాక్టర్ మల్లిఖార్జునరావు, డాక్టర్ భవాని శంకర్ అన్నారు. శుక్రవారం ఉదయం మండలంలోని చొప్పెల్ల పీహెచ్సీ పరిధి చెముడులంకలో ”వైఎస్సార్ ఫ్యామిలీ డాక్టర్” కార్యక్రమాన్ని వైద్య సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రజల జీవిత గమనంలో చేసే కొన్ని ఆశ్రద్ధ పనుల వల్ల పలువురు రోగాల బారిన పడుతూ ఉంటారన్నారు. వాటిని దఅష్టిలో ఉంచుకుని అనునిత్యం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయన్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్వో కె.జ్యోతి కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ సూర్యనారాయణ, హెచ్వి ఏఆర్బి మణి, హెచ్ఎస్ శివప్రసాద్, ఏఎన్ఎంలు మంగాయమ్మ, శ్రీలక్ష్మి, రాజమణి, ఆశాలు, హెల్త్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.