రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలి

Feb 1,2024 16:27 #school, #West Godavari District

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు వాడాలని కాశిపాడు ఆరోగ్య సహాయకులు నామాల రాజు తెలిపారు. గురువారం కాశిపాడు హైస్కూల్ విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఐరన్ మాత్రలు అందజేశారు. ఈ సందర్భంగా నామాల రాజు మాట్లాడుతూ.. రక్తహీనత లోపిస్తే అలసటగా ఉంటుందని చర్మం పాలిపోయి నోటి పూతతో అనారోగ్యంగా ఉంటారని అన్నారు. వీటి నివారణకు విద్యార్థులు ఐరన్ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం ఏఎస్ఎస్ బి.ఆర్ ప్రసాదు ఏఎన్ఎం శివకుమారి ఆశాలు పాల్గొన్నారు.

➡️