ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన జీలకర్ర నాగేంద్ర

Mar 20,2024 10:38 #visaka, #vizag

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డిని వైసిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జీలకర్ర నాగేంద్ర తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తనని వరుసగా మూడోసారి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు జీలకర్ర నాగేంద్ర సిఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి విద్యార్థి విభాగం కష్టపడి పనిచెయ్యాలని సిఎం ఆదేశించినట్లు నాగేంద్ర తెలిపారు.

➡️