ప్రజాశక్తి-చల్లపల్లి : శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా చల్లపల్లి ప్రధాన సెంటర్లో నిర్వహించిన సిలువ యాత్రలో అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పాల్గొని, స్థానిక ప్రజలతో కలిసి సిలువ మోశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ, ప్రేమ, కరుణ, సహనం, త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం, జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక చర్చి సభ్యులు పలువురు సభ్యులు పాల్గొన్నారు.