ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్‌(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన నివాసం నుండి అభిమానులుతో కలిసి ర్యాలీగా బయలుదేరి తాడేపల్లిగూడెం రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో కె.చెన్నయ్యకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. తొలుత పట్టణ పోలీసు ఐ ల్యాండ్‌ వద్ద తాడేపల్లిగూడెం సిపిఎం నాయకులు కర్రి నాగేశ్వరరావుతో కలిసి ఆర్డీవో కార్యాలయం వరుకు ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. అవినీతి పాలన అంతమొందించి, దేశంలో బీజేపీని, రాష్ట్రంలో వైసీపీని గద్దె దింపడానికి రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి కాంగ్రెస్‌ అభ్యర్ధి మార్నిడి విజయానికి సిపిఎం సహకారాన్ని అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్‌, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️