Skip to content
- ఇండియా బ్లాక్ అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు
ప్రజాశక్తి -కాళ్ళ
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలంలోని కాళ్లకూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. గ్రామంలో ముమ్మరంగా పర్యటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటింటా వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో మాట్లాడి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా పిసి సి అధికార ప్రతినిధి సోడదాసీ గంగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది హామీల గురించి వివరించారు. రెండు లక్షల రైతు రుణమాఫీ, ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ.8,333, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400, రూ.5 లక్షలతో పేదలకు గృహ నిర్మాణం, వృద్ధులకు పింఛన్ రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్య తదితర పథకాలను అమలు చేస్తామన్నారు. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్న కె బి ఆర్ నాయుడు, ఉండి ఎంఎల్ఎ అభ్యర్థిగా పోటీ చేసిన వేగేశ్న వెంకట గోపాలకఅష్ణంరాజును అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు కొండా రాజేష్ కుమార్, బర్రా పార్థు,కార్యకర్తలు తదితరులు పాల్గన్నారు.