సిపిఎం ఎంపి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి : చింతూరులో ప్రచారం

చింతూరు (అల్లూరి సీతారామరాజు) : చింతూరు మండలం మధుగూరు గ్రామంలో సిపిఎం ఎంపి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ … శుక్రవారం విస్తఅత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్‌ పాల్గని మాట్లాడుతూ … బిజెపి పొత్తు పార్టీలను, వైసీపీని ఎన్నికల్లో ఓడించడం ద్వారానే ఆదివాసి హక్కులు, చట్టాలు కాపాడబడతాయని అన్నారు. నిత్యం ప్రజల కోసం ఆదివాసుల కోసం ఆదివాసి ప్రాంత హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు, పాండు సుబ్బారావు, సోయం రాజులు, సోయం భారతి, మనోజ్‌, బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️