నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. నిఖిల్ 20 వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మలయాళ నటి సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఓ ఆసక్తికర అప్డేట్ను అందించారు. ‘స్వయంభు టీం.. ఒక పురాతన కాలం బ్యాక్డ్రాప్లో సాగే యుద్ధ ఎపిసోడ్ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తోంది. 12 రోజులపాటు జరుగనున్న ఈ షెడ్యూల్ను రూ.8 కోట్ల బడ్జెట్తో షూట్ చేస్తున్నాము. నిఖిల్ యాక్షన్, స్టంట్స్తో సాగే ఈ భారీ వార్ సీక్వెన్స్ అద్భుతంగా ఉండబోతుంద’ని మేకర్స్ ట్వీట్ చేశారు.