చీరాలను సిఎంకు గిఫ్ట్‌గా ఇద్దాం: కరణం వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల: రాష్ట్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం అని నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరవేసి చీరాలను సీఎం జగన్మోహన్‌రెడ్డికి గిఫ్టుగా ఇద్దామని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. సోమవారం రామకృష్ణాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైసిపి నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకువెళ్లి వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ నెల 24న తాను నామినేషన్‌ వేస్తున్నానని, ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వైసిపి అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపాలిటీ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ బొనిగల జైసన్‌బాబు, పలువురు కౌన్సిలర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

➡️