కోటా రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన పాసింజర్‌ రైలు

Jan 6,2024 10:32 #Rajasthan, #Train Accident

కోటా : రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్‌-భోపాల్‌ పాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గోవ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పలువురు ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌లో నుంచి దూకేశారు. వెంటనే సహాయక బందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ ఘటన అనంతరం ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్‌లపైకి మళ్లించి గమ్యస్థానాలకు తరలించారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ జరిగింది. ఈ లైనులో రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

➡️