పశ్చిమ బెంగాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. నదియా పట్టణంలో విద్యుత్ పరికరాలు స్టోరేజీ చేసే గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.