కాశ్మీర్‌లో ఓటు వేసిన నవదంపతులు

Apr 20,2024 23:55 #2024 election, #Polling

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం జరిగిన తొలిదశ పోలింగ్‌ సమయంలో పెళ్లివస్త్రాలతో ఉన్న నూతన వధూవరులు అందరి దృష్టినీ ఆకర్షించారు. కిష్త్వార్‌ జిల్లాలోని బంజ్వా గ్రామానికి చెందిన రాజేష్‌ ఠాకుర్‌, శ్రద్ధాదేవిలు పెళ్లిరోజున పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రజల గొంతుకను పార్లమెంటులో వినిపించే నాయకులను ఎన్నుకోవటం గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు.

➡️