సుధాకర్‌ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Feb 1,2024 16:15 #nara bhuvaneswari, #paramarsa

నెల్లూరు : ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో టీడీపీ కార్యకర్త తాటిపర్తి సుధాకర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో సుధాకర్‌ గుండెపోటుతో మఅతి చెందాడు. దీంతో సుధాకర్‌ భార్య వెంగమ్మ, కుటుంబసభ్యులను భువనేశ్వరి ఓదార్చి.. రూ.3 లక్షల చెక్కును అందజేశారు. సుధాకర్‌ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భువనేశ్వరి హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమైన భువనేశ్వరి.. వారితో మాట్లాడుతూ.. ”మనల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారు. పేదలందరికీ ప్రతీఏటా మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరికీ రూ.15 వేలు చొప్పున ఇస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. దయచేసి ఏదీ దుర్వినియోగం చేయొద్దు” అని భువనేశ్వరి కోరారు.

➡️