ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న వెంకన్నను 77,332 మంది దర్శించుకోగా, 30,540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/TTD-3.jpg)