– మృతులు హైదరాబాద్ వాసులు
ప్రజాశక్తి- ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం చెందారు. తిరుమల వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెరదిన వారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ కమిషనర్ హనుమంతు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం… తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఆల్వాల్ దినకరన్ కాలనీకి చెందిన రవీందర్ (55), లక్ష్మి (50) దంపతుల కుమారుడు బాలకిరణ్ (25)కు కావ్య (23)తో గత నెల 29న తెనాలిలో వివాహమైంది. ఈ నెల 3న షామీర్పేట్లోని సమ్మర్ గ్రీన్ రిసార్ట్లో రిసెప్షన్ జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఈ నెల నాలుగున స్విఫ్ట్ కారులో వెళ్లారు. దర్శనం అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్తుండగా బుధవారం తెల్లవారుజామున 5.15 గంటల సమయంలో ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వారు కారు వేగంగా ఢకొీట్టింది. దీంతో, ఈ కారులోని మంత్రి రవీందర్, ఆయన భార్య లక్ష్మి, కుమారుడు బాలకిరణ్ (25), కోడలు కావ్య (23), డ్రైవర్ అశోక్ అక్కడికక్కడే మృతి చెందారు. సిఐ హనుమంతు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతితో హైదరాబాద్లోని ఆల్వాల్ దినకరన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.