సిపిఎం, కాంగ్రెస్‌ సీట్ల సర్దుబాటు

-ఒక పార్లమెంట్‌తో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో సిపిఎంాకాంగ్రెస్‌ పార్టీల సీట్ల సర్దుబాటు కుదిరింది. సర్దుబాటులో భాగంగా ఒక పార్లమెంట్‌, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ చేయబోతోంది. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఆన్‌లైన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు హాజరయ్యారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపి, దాని మిత్రపక్షాలైన టిడిపి. జనసేనలను, బిజెపికి కొమ్ముకాస్తున్న నిరంకుశ వైసిపిని ఓడించడానికి ఇండియా వేదిక పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చేసుకుని ఉమ్మడిగా పోటీ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ గతంలోనే నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. ఆ మేరకు సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీలతో జరిగిన ఒప్పందం ప్రకారం ఒక పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రధానమైన రెండు శిబిరాలు బిజెపికి లంగిపోయిన విషయాన్ని ప్రకటనలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘ప్రధానమైన ఆ రాజకీయ కర్తవ్య నిర్వహణలో ఇండియా వేదిక పార్టీలు ఐక్యంగా సర్దుబాటు చేసుకుని పోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గతంలో సిపిఎం పది అసెంబ్లీ స్థానాలు ప్రకటించినప్పటికీ రాజకీయ ఆవశ్యకత రీత్యా కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవటం జరిగింది.’ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం శ్రేణులు ఇండియా వేదిక పార్టీలైన సిపిఐ, కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, రాష్ట్ర ప్రజానీకం ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా ఇదే విధమైన ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో ఇండియా వేదిక గెలుపే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు జరిగిందని ఆ ప్రకటనలో తెలిపారు.సిపిఎం పోటీ చేసే స్థానాలు
పార్లమెంట్‌
1. అరకు
అసెంబ్లీ స్థానాలు
1. రంపచోడవరం
2.కురుపాం
3.గాజువాక
4.విజయవాడ సెంట్రల్‌
5.గన్నవరం
6.మంగళగిరి
7.నెల్లూరు టౌన్‌
8. పాణ్యం
➡️