ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించని తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న తీర్పును సవాల్ చేసింది. అప్పీల్ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఎపిపిఎస్సి తరఫున సీనియర్ అడ్వకేట్ ఎస్ఎస్ ప్రసాద్ సోమవారం డివిజన్ బెంచ్ను కోరారు. పిటిషన్పై మంగళవారం విచారణ జరుపుతామని న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజరుతో కూడిన డివిజన్ బెంచ్ ప్రకటించింది.
గ్రూప్-1 మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనం విషయంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థుల పిటిషన్లను సింగిల్ జడ్జి అనుమతించారు. తిరిగి పరీక్షను నిర్వహించి మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సర్వీస్ కమిషన్ను ఆదేశించారు. ఇప్పటికే మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఉద్యోగాలు చేస్తున్నారని, ఆ తీర్పు వల్ల వారంతా తీవ్రంగా నష్టపోతారని ఎపిపిఎస్సి కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్లో పేర్కొన్నారు.