మత్స్యకారులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం

Dec 8,2023 16:36 #Atchannaidu, #fishermen, #YCP Govt
atchannaidu on ycp govt

విశాఖ : మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ముఖ ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తుఫాన్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తుంటే.. జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు కొత్త బోట్లు కొని ఇస్తామని ఆయన చెప్పారు. పేరుకే కార్పొరేషన్లు ఉన్నాయని, ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని అన్నారు. వీటి వలన ఎవరికీ ఉపయోగము లేదని విమర్శించారు.

➡️