- సిపిఎం అభ్యర్థి బాబురావు, కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్ ప్రచారం
ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సింగ్ నగర్, కండ్రిక, పైపుల్ రోడ్డు, లోనా సెంటర్ తదితర ప్రాంతాల్లో సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ,విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరి భార్గవ్ తమ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం బైక్ ర్యాలీ ద్వారా విస్తతంగా నిర్వహించారు. ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ ,ఆర్జేడి ఇతర లౌకిక శక్తులు ప్రజాసంఘాలు ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ బైక్ ర్యాలీ సాయంత్రం గవర్నర్ పేట, హనుమాన్ పేట, గాంధీనగర్ ,తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 13న జరుగుతున్న పోలింగ్లో విజయవాడ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్కు ,సిపిఎం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి చిగురుపాటి బాబురావుకు ప్రజలు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేతలు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.